ఇద్దరూ ఇద్దరే - అనకాపల్లి జిల్లాలో బీజేపీ బలోపేతానికి ద్వారపురెడ్డి–బొడ్డెడల కృషి
🗞️ బిబి న్యూస్ | 20 Jun 2026
అనకాపల్లి, జూన్ 20:
అనకాపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు అహర్నిశలు శ్రమిస్తున్నారని పార్టీ శ్రేణులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఎన్నికల ప్రత్యేక సర్వే (SIR) వెరిఫికేషన్, బూత్ స్థాయి బలోపేతం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ విస్తరణకు వీరు కృషి చేస్తున్నారు. అలాగే సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు.పార్టీ నాయకుడు దాడి వీరునాయుడు వంటి సేవాభావం కలిగిన కార్యకర్తల సహకారంతో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు సామాజిక బాధ్యతను కూడా సమానంగా నిర్వర్తించడం వీరి ప్రత్యేకతగా నిలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అడుగుజాడల్లో నడుస్తూ, పార్టీ జాతీయ–రాష్ట్ర నాయకత్వం సూచించిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడంలో ఈ ఇద్దరు నాయకులు ముందుంటున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ విస్తరణ, సేవా కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.జిల్లాలో ప్రతి మండలం, ప్రతి బూత్ స్థాయికి పార్టీని తీసుకెళ్లాలనే లక్ష్యంతో ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బొడ్డెడ నాగేశ్వరరావు నిరంతరం కృషి చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే ఉత్సాహం, ఇదే కార్యాచరణ కొనసాగితే అనకాపల్లి జిల్లాలో బీజేపీ ఒక మహావృక్షంలా ఎదిగి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ప్రజలు అంచనా వేస్తున్నారు.ప్రజాసేవ, పార్టీ విస్తరణ, సామాజిక బాధ్యతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న ఈ నాయకత్వం అనకాపల్లి జిల్లాలో బీజేపీ భవిష్యత్తుకు మరింత బలం చేకూరుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.