ఎగువ వంతెన కింద అక్రమ నిర్మాణాల హడావిడి – అధికారులు ఎక్కడ?
🗞️ బిబి న్యూస్ | 08 Apr 2026
అనకాపల్లి, కొత్తూరు పంచాయతీ:అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో, జియో ఆఫీస్ ఎదుట ఉన్న ఎగువ వంతెన కింద నూతనంగా రేకుల షెడ్డుల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు దుకాణాల కోసం ఏర్పాటు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.పంచాయతీ సర్పంచ్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, ప్రస్తుతం స్థానిక పరిపాలనలో స్పష్టమైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్మాణాలు నియంత్రణ లేకుండా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు కనీసం స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.ప్రధానంగా, ఎగువ వంతెన కింద నిర్మాణాలు చేయడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రహదారి భద్రత, ట్రాఫిక్ సమస్యలు, మరియు ప్రజల సురక్షతపై ప్రభావం పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, నిర్మాణాలపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.